కోలీవుడ్ హీరో విశాల్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన తాజాగా మాలీవుడ్ లో ప్రకంపనులు రేపుతున్న హేమ కమిటీ రిపోర్ట్ పై ఎవరైనా అలాంటి పనులు చేస్తే చెప్పుతో కొట్టాలి అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈయన చెప్పిన మాటలపై సీనియర్ నటి రాధిక మండిపడింది.వాళ్ళని కొట్టే దమ్ము నీకుందా అంటూ విశాల్ పై విరుచుకుపడింది.మరి ఇంతకీ విశాల్ ని ఎందుకు రాధిక అలా టార్గెట్ చేసింది అన్నది ఇప్పుడు చూద్దాం.. మాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తున్న వేళ చాలామంది నటీనటులు బయటికి వచ్చి నోరు విప్పే నటీమణులకు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే హేమ కమిటీ రిపోర్ట్ ని కి మద్దతూ తెలుపుతూ అలాంటి వారిని చెప్పుతో కొట్టాలి అంటూ నటుడు విశాల్ సంచలన కామెంట్లు చేశారు. 

అయితే విశాల్ కామెంట్లపై రాధిక తాజాగా స్పందిస్తూ.. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ విశాల్ ని రాధిక టార్గెట్ చేసింది.. నాయకుడు అనేవారు ఎవరైనా సరే ఇలా చెప్పకూడదు.. మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే నాకు వచ్చి చెప్పండి.ఆ ఇబ్బందులను నేను క్లియర్ చేస్తాను అని అనాలి. అంతేకానీ చెప్పుతో కొట్టండి కాళ్ళతో తన్నండి కాదు.. అయినా పెద్ద పెద్ద వాళ్లను చెప్పుతో కొట్టండి అని ఎలా అనగలరు.

ఒకవేళ పెద్దవాళ్లు అణుచితంగా ప్రవర్తిస్తే వారిని చెప్పుతో కొట్టాక ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇండస్ట్రీలో ఆమె ఉండగలదా.. కొంతమంది పెద్దవాళ్లు అణుచితంగా ప్రవర్తిస్తే ఆ పెద్ద పెద్ద వారిని చెప్పుతో కొట్టే దమ్ము నీకుందా.. నటినటులతోపాటు నిర్మాతలు కూడా కలిసివచ్చి ఈ కమిటీకి సపోర్ట్ ఇవ్వండి. తర్వాత మనం అందరం కలిసి ఏం చేయాలో ఆలోచిద్దాం.. అంటూ విశాల్ పై రాధిక సంచలన కామెంట్లు చేసింది. అంతే కాదు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది కాదు అంటూ కూడా విశాల్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది

మరింత సమాచారం తెలుసుకోండి: