ఈ మధ్యకాలంలో ఏదైనా స్టార్ హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన బ్లాక్ బాస్టర్ మూవీ లను రీ రిలీజ్ చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో ఒకటి అయినటువంటి మురారి మూవీ ని రీ రిలీజ్ చేశారు. దానికి అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ఇంద్ర మూవీ ని రీ రిలీజ్ చేశారు.

దానికి అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా మాస్ మూవీ ని కూడా రీ రిలీజ్ చేశారు. ఇకపోతే రేపు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి గబ్బర్ సింగ్ ను రీ రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి వి వి దానయ్య నిర్మించిన సరిపోదాం శనివారం అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రస్తుతం మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత దానయ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీస్ కాబోతుంది. దానితో మీ సినిమా నడుస్తున్న కొన్ని థియేటర్లను ఆ సినిమాకు ఇచ్చారంట ... కదా. దాని ద్వారా మీకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురయింది. దానికి దానయ్య సమాధానం ఇస్తూ ... ఆయన పవర్ స్టార్ , ఈయన నాచురల్ స్టార్. ఎవరి స్టామినా వారిది. ఆ సినిమా రీ రిలీజ్ వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు అని దానయ్య క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: