ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు. అయితే.. ఈ పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు. శనివారం ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తన తల్లితో కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడిపి జిల్లాలోని కుందాపురలోనే జన్మించారు.


జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంత ఊరు కుందాపుర. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం ముందు నిలబడి తల్లితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ తన తల్లి పుట్టిన రోజు అని, ఆమె పుట్టినరోజుకి నేను ఇచ్చే మొదటి బహుమతి ఇదేనంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకోచ్చారు.

ఇది ఇలా ఉండగా... నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. తాతమ్మ కళ సినిమాతో ఆయన సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుకను పురస్కరించుకొని సినీ పరిశ్రమ పెద్దలు సెప్టెంబర్ 1వ తేదీన అంటే ఆదివారమే బాలయ్య బాబు గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులందరూ రానున్నారు.. అయితే నందమూరి  బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకకు వెళ్లకుండా... పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్లాన్ వేసినట్లుగా చెప్పుకుంటున్నారు.


తల్లి పేరు చెప్పి హైదరాబాద్ లో ఉండాల్సిన ఎన్టీఆర్ ఉడిపి వెళ్లినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉంటే ఎన్టీఆర్ కు బ్యాడ్ నేమ్ వస్తుందని, అందుకే తన తల్లి పేరు చెప్పి ముందే అలర్ట్ అయ్యాడని అంటున్నారు. బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుక ఆదివారం జరుగనుంది. కానీ ఎన్టీఆర్ సెప్టెంబర్ 3వ తేదీ దాకా ఎన్టీఆర్ హైదరాబాద్ కి రావడం లేదు. అందువల్ల బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుకను ఎస్కేప్ చేయొచ్చు. బాలయ్యకు గట్టి షాక్ ఇవ్వాలనే ప్లాన్ తోనే ఎన్టీఆర్ ఇలా చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: