పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే టాలీవుడ్ యువ దర్శకుడు అయినటువంటి సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యాక పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఇక కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పవన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని పదవుల్లో కొనసాగుతున్నాడు. రాజకీయ పనులు అన్ని మోగియడంతో పవన్ కళ్యాణ్ "ఓజి" మూవీ షూటింగ్ ను మళ్ళీ తిరిగి మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు , మూడు రోజుల్లో విలువడబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు , మామూలు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: