తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించడం , ఆ మూవీ లు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ సంస్థకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ వారు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూనే , చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సంస్థ వారు మొట్ట మొదటి సారి పుష్ప మూవీ తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు.

మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంస్థ వారు రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థకు ఈ మూవీ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ క్లోజ్ అయినట్లు , దీని ద్వారానే ఈ సంస్థకు వందల వందల కోట్లలో డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ ఓ టి టి డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క అన్ని భాషల ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఏకంగా 270 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా జరగని స్థాయిలో ఈ మూవీ కి ఓ టీ టీ డీల్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇలా పుష్ప పార్ట్ 2 మూవీ ద్వారా మైత్రి సంస్థకు అదిరిపోయే రేంజ్ లో డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa