ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ గుడ్లవల్లేరు గర్ల్స్ కాలేజీ లో బాత్రూం లోని రహస్య కెమెరాల ఇష్యూ ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చెప్పనక్కర్లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇష్యూ పై చాలామంది నోరు విప్పి దీన్ని ఖండిస్తున్నారు. అంతేకాదు అలాంటి సీక్రెట్ కెమెరాలు పెట్టి చదువుకునే అమ్మాయిలు జీవితాలతో ఆడుకునే వారిని కఠినంగా శిక్షించాలి ఉరితీయాలి అంటూ ఇలా ఎంతోమంది గళం విప్పుతున్నారు..అయితే తాజాగా కాలేజ్ బాత్రూం లో సీక్రెట్ కెమెరాల ఇష్యూలో ఇండస్ట్రీకి సంబంధించిన ఓ హీరోని వైసిపి అభిమానులు, లీడర్లు ఒక ఆట ఆడుకుంటున్నారు.మరి ఇంతకీ ఆయన ఎవరు అనేది చూస్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆంధ్రప్రదేశ్ లో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సేఫ్ హాండ్స్ లో ఉంది అంటూ షాకింగ్ ట్విట్ చేశాడు.

 అయితే ఈ ట్వీట్ పై చాలా మంది వైసీపీ అభిమానులు ధ్వజమెత్తారు.అయితే తాజాగా గుడ్లవల్లేరు కాలేజీ బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టి 300 అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన విషయాన్ని లేవనెత్తుతూ వైసిపి అభిమానులు ఇప్పుడు నిజంగానే ఏపీ సేఫ్ హాండ్స్ లో ఉందా.. ఇంకొకసారి టిడిపి కూటమి ప్రభుత్వం లో ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అని ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడితే తాటతీస్తాం.. తోలు ఒలిచేస్తాం..అంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి వార్నింగులు ఇస్తున్నారు వైసిపి అభిమానులు.

ఇక ఈ ఇష్యూపై ఇప్పటికే చాలామంది వైసిపి కీలక లీడర్లు కూడా స్పందిస్తూ  చంద్రబాబు హయాంలో జరిగేది ఇదేనా.. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారా అంటూ మాట్లాడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ సినిమాలు చేసే వాళ్ళు చేసుకోకుండా అనవసరంగా రాజకీయాల్లో వేలు పెడితే ఇలాగే అన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు సాయి ధరంతేజ్ ని ఉద్దేశిస్తూ కొంతమంది జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: