తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోస్ ఉన్నప్పటికీ అటు నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలకృష్ణకు మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ మరి ముఖ్యంగా మాస్ ప్రేక్షకులందరూ బాలయ్య పేరు వినిపించిందంటే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగి పోతూ ఉంటారు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై ఇక ఇప్పుడు ఇప్పుడు స్టార్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బాలయ్య ఇటీవల తన 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే బాలకృష్ణ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంతో మంది స్టార్ డైరెక్టర్లతో పనిచేశాడు. ఎన్నో బ్లాక్బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టాడు. అయితే ఇలా బాలయ్యను ప్రేక్షకులకు నచ్చినట్లుగా చూపించిన డైరెక్టర్లలో బి గోపాల్ ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాలు అయితే ఎప్పటికీ బాలయ్య అభిమానులకు ఫేవరెట్. ఇక బి గోపాల్ బాలయ్య కాంబినేషన్లో ఇవి మాత్రమే కాకుండా ఎన్నో బ్లాక్బస్టర్లు కూడా ఉన్నాయి.

 కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం బాలకృష్ణ వరుస ప్లాపులతో సతమతమయ్యారు. దీంతో బాలకృష్ణ నుంచి నరసింహనాయుడు,  సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్లు చూడటం కష్టమేన అని అభిమానులు నిరాశపడుతున్న సమయంలో.. ఇక బాలయ్య అభిమానుల నాడిని పట్టుకున్న డైరెక్టర్ ఒకరు తెరమీదకి వచ్చారు. ఆయనే బోయపాటి శ్రీను. మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్  అయినా బోయపాటి శ్రీను గాడ్ ఆఫ్ మాసేస్ బాలయ్యతో సినిమా తీస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ బ్లాక్ బస్టర్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ అదే రేంజ్ లో హిట్ అయింది.


 ఆ తర్వాత బాలయ్యను సరికొత్తగా చూపించిన బోయపాటి అఖండ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో BB4  వర్కింగ్ టైటిల్ తో మరో కొత్త సినిమా తెరకెక్కుతుంది. ఇలా 50 ఏళ్ల బాలయ్య సినీ కెరియర్లో బి.గోపాల్ తర్వాత బాలయ్యకు సరిగ్గా సరిపోయింది బాలయ్య అభిమానులు నాడిని పట్టుకుంది కేవలం బోయపాటి శ్రీను అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బోయపాటి - బాలయ్య కాంబోలో సినిమా వస్తుందంటే చాలు మాస్ ప్రేక్షకులు అందరికీ కూడా పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: