మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న యూవి క్రియేషన్స్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ కోసం ఈ సినిమా నిర్మాతలు అయినటువంటి వంశీ , ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి కూడా ఈ ఇద్దరు నిర్మాతలు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు పెద్ద మొత్తంలో ఖర్చు అయినట్లు సమాచారం.

ఖర్చు ఎంతైనా పర్లేదు కానీ ఈ సినిమా ఔట్ పుట్ మాత్రం అద్భుతంగా ఉండాలి అని ఈ సినిమా నిర్మాతలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాలోని చాలా సన్నివేశాల కోసం భారీ సెట్ లను నిర్మిస్తున్నట్లు , అలాగే ఆ సెట్ లు కూడా అత్యంత ఖర్చుతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ నిర్మాతలు వంశీ , ప్రమోద్ ఈ సినిమా విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈయన కూడా ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా యూ వి క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలు అయినటువంటి వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాకు గనక పాజిటివ్ టాక్ రానట్లయితే ఈ మూవీ ద్వారా పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఇలాంటి విజయాన్ని అందుకొని , ఏ రేంజ్ కలెక్షన్లను చేస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష , చిరు కి జోడిగా నటిస్తూ ఉండగా ... ఆశికా రంగనాథ్మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: