నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలాగే ఎంతో మంది హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీలను ఎంచుకొని కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. అలా బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ఓ స్టోరీని ఎంచుకొని దానితో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా ఏది ..? దానిని ఎంత మంది హీరోలు రిజెక్ట్ చేశారు అనే వివరాలను తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కే మురళీ మోహన రావు , చిరంజీవి హీరోగా కథానాయకుడు అనే పేరుతో పరుచూరి బ్రదర్స్ రాసిన కథతో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. అందులో భాగంగా కథ మొత్తం పూర్తి అయిన తర్వాత చిరంజీవి కి దానిని వినిపించారు. కానీ ఆ కథ చిరంజీవికి పెద్దగా నచ్చలేదు. ఇక ఆ తర్వాత మురళీ మోహన రావు ఇదే కథను సూపర్ స్టార్ కృష్ణ తో చేయాలి అని ఆయనకు కూడా ఆ కథను వినిపించాడు. కానీ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ సినిమా చేశాడు. ఇక ఆ సమయంలో వరుస విజయాలతో సూపర్ జోష్ లో ఉన్న సుమన్ తో ఈ సినిమా చేయాలి అని సుమన్ కి కూడా ఈ మూవీ కథను వినిపించాడు. 

కానీ సుమన్ కూడా ఈ కథ మొత్తం విని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత కృష్ణం రాజు , శోభన్ బాబు , రమేష్ బాబు లకు కూడా ఈ మూవీ కథను వినిపించాడు. వారు కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారు. ఇక చివరిగా బాలయ్య కు ఈ మూవీ కథను వినిపించి , ఆయన కూడా రిజెక్ట్ చేస్తే ఈ మూవీ కథను పక్కన పెట్టాలి అని మురళి మోహన రావు అనుకున్నాడట. ఇక ఆయనకు కథను వినిపించడం , ఆ కథ బాలకృష్ణకు బాగా నచ్చడం , కథానాయకుడు అనే పేరుతో ఈ మూవీ రూపొంది విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: