టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. నాగార్జున ఆఖరుగా ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నాగార్జున సోలో హీరోగా ఒక్క మూవీ కి కూడా కమిట్ కాలేదు. 

ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర సినిమాలను ,  లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోవ్గా రూపొందుతున్న కూలీ మూవీ లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ రోజు ప్రారంభం కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇకపోతే నాగార్జున కొన్ని రోజుల క్రితం ఒక ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ... ఓ దర్శకుడి గురించి చెప్పుకొచ్చాడు. ఆ దర్శకుడు ఎవరు ..? అతని గురించి ఏం చెప్పాడు అనే వివరాలను తెలుసుకుందాం.

నాగార్జున కొన్ని రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ గురించి చెబుతూ ... రామ్ గోపాల్ వర్మ వాట్కా తాగి కథ చెబుతూ ఉండేవాడు. నేను కొంచెం తాగేవాడిని. కానీ ఆయన బాగా తాగేవాడు. ఆయన కథ చెబుతూ ఉన్నప్పుడు ముందు ఉన్న వస్తువులను కత్తుల అనుకొని స్టోరీ చెప్పేవాడు. నాకు దెబ్బకు భయమేసి ఆయన స్టోరీ చెప్పేటప్పుడు సోపాకి అవతల వైపు అతను , మరో వైపు నేను కూర్చోనే వాడిని అని నాగార్జున తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: