సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోయిన్ల మధ్య పోటీ తత్వం అనేది నెలకొంటుంది. అయితే కొంతమంది ఈ పోటీని ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తారు. కానీ మరికొంతమంది మాత్రం వ్యక్తిగతంగా తీసుకొని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్ల మధ్య సఖ్యత అనేది ఉండదు. ఇక గతంలో హీరోయిన్ వాణిశ్రీ విజయనిర్మల మధ్య గొడవలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా దివంగత నటి శ్రీదేవి,జయప్రద మధ్య పచ్చగడ్డి వేస్తే బగుమనేంత విభేదాలు ఉండేవని, కానీ వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ సినిమా షూటింగ్స్ వరకు కలిసి మాట్లాడుకునేవారు. ఒక్కసారి కెమెరా ఆఫ్ చేస్తే ఎడ మొహం పెడ మొహం పెట్టుకునేవారు అనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చెప్పే మాట. 

అయితే ఇండస్ట్రీలో ఉండే మరో సీనియర్ హీరోయిన్ కూడా ఓ హీరోయిన్ మీద పగతో ఎక్స్పోజింగ్ చేయడం మొదలుపెట్టిందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు దివంగత నటి సౌందర్య. అవును మీరు వినేది నిజమే. సౌందర్య అప్పట్లో ఎన్నో హిట్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. గ్లామర్ పాత్రల్లో నటించకుండానే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది.దాంతో ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లను పక్కకు నెట్టి సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.కానీ సడన్గా సౌందర్యకు అవకాశాలు తగ్గిపోయాయి. అందరి చూపు ఆ హీరోయిన్ మీద పడింది.

ఆమె ఎవరో కాదు సిమ్రాన్.అలా సిమ్రాన్ ఎంట్రీ ఇవ్వడంతో కొన్ని సౌందర్య నటించాల్సిన సినిమాలు కూడా సిమ్రాన్ ఎగిరేసుకుపోయిందట.దాంతో ఎక్కడ తన కు సినిమా అవకాశాలు తగ్గిపోతాయోనని సౌందర్య భయపడిందట.దాంతో సిమ్రాన్ మీద కోపం పెంచుకొని సౌందర్య కూడా ఆమెకు వచ్చిన సినిమాల్లో కాస్త గ్లామర్ రోల్స్ చేయడం ఎక్స్పోజింగ్ చేయడం మొదలుపెట్టిందట. అలా  జయం మనదేరా, అన్నయ్య, చూడాలని ఉంది వంటి సినిమాల్లో  నాభి అందాలను చూపిస్తూ సౌందర్య ఎక్స్పోజింగ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: