తెలుగులో బిగ్ బాస్-8 షో ఈ రోజున సాయంత్రం మొదలు కాబోతోంది. దీంతో బిగ్ బాస్ లవర్స్ కి మంచి స్టఫ్ దొరుకుతుందని చెప్పవచ్చు. ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు తాజాగా ఒక అదిరిపోయే ప్రోమోని సైతం బిగ్ బాస్ షో నిర్వాహకులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నారు .ఎవరెవరు వెళ్లబోతున్నారని చాలామంది ఎగ్జాయిటింగ్గా ఎదురు చూస్తున్నారు.


తాజాగా విడుదల చేసిన ప్రోమో లో ఈ సీజన్ లిమిట్ లెస్ షో అంటూ నాగార్జున సందడి చేస్తున్నారు. ఈసారి కంటిస్టేంట్లను సోలోగా పంపడం లేదని కూడా ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. జోడీలుగా హౌస్ లోకి పంపించబోతున్నట్లు తెలియజేశారు. సరిపోదా  శనివారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అటు హీరో నానితో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ లు బిగ్ బాస్-8 లో సందడి చేయబోతున్నారు. అలాగే ఈ ప్రోమోలు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకోవడం జరిగింది. 35 చిన్న కథ కాదు సినిమా కోసం రానా తో పాటు నివేద థామస్ కూడా రావడం జరిగింది.


వీరిద్దరూ కలిసి నాగార్జునతో చేసిన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నది. అలాగే చివరిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి హౌస్ లో కనిపించడం మరింత ట్విస్ట్ గా కనిపిస్తోంది. తనతో పాటు ఒక కంటెస్టెంట్ ని కూడా బయటికి తీసుకువెళ్తానని తెలియజేస్తున్నారు.ఈసారి లిమిట్ లెస్ అంటూ టర్న్ అంటూ.. మొదటి వీకెండ్ నుంచి బిగ్ బాస్ మొదలు పెట్టబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతవరకు సింగిల్ గా కంటెస్టెంట్లు పాల్గొన్నప్పటికీ ఇప్పుడు జోడీలుగా వెళ్లడంతో కచ్చితంగా స్టఫ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మొదటిరోజు మొత్తం 14 మంది కంటిన్యూస్టెంట్లు హౌసులోకి వెళ్లబోతున్నారట. మరి ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనే విషయం మరి కొన్ని గంటలలో తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: