టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోలలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలా ఫ్యాన్ బేస్ కలిగిన వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. ఈమధ్యనే ఎన్నికలలో గెలిచి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఓజి అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా పొలిటికల్ కారణంగా ఆలస్యం అవుతోంది.మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ సుజిత్.


Og చిత్రం పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి అంచనాలకు మించి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ముంబై నగరంలో ఈ సినిమా షూటింగ్ ని చాలా బాగా వరకు పూర్తి చేశారు అట. అలా పవన్ కళ్యాణ్ కు వీలు కుదిరినప్పుడల్లా సినిమా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ డేట్ల కోసం డైరెక్టర్ సుజిత్ ఎంత ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు.. ఇలాంటి సమయంలోనే రేపటి రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజి సినిమా అప్డేట్ను తెలియజేశారు.


తాజాగా రిలీజ్ డేట్ గురించి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ని విడుదల చేస్తూ.. 2025 మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే అదే రోజున రామ్ చరణ్ పుట్టినరోజు కూడా ఉన్నదట. దీంతో మెగా అభిమానులకు ఒకేరోజు రెండు పండుగలు కాబోతున్నాయని చెప్పవచ్చు. ఓ జి సినిమాని ప్రముఖ బ్యానర్ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉండగా హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే అర్జున్ దాస్ ,శ్రియా రెడ్డి ,ప్రకాష్ రాజు తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: