‘విశ్వంభర’.. ఖైదీ నెంబర్ 150 తర్వాత, మళ్లీ మెగాస్టార్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ సినిమాగా రూపొందుతుంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు మేకర్స్. ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట.మూడు దశాబ్దాల కిందట వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోకి సుందరి’ సినిమాకు అప్పటి ఆడియెన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో.. ఇప్పుడు విశ్వంభర సినిమాను చూస్తున్నంత సేపు అదే ఫీలింగ్ కలిగేలా మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు.వచ్చే సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఒళ్లు జలదరించే వీఎఫ్ఎక్స్ ఇందులో కనిపించనున్నాయట. దాని కోసం హాలీవుడ్ టెక్నీషీయిన్లను పనిచేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే.. విశ్వంభర లో కేవలం ఒక్క సీక్వెన్స్ కోసమే మేకర్స్ 12 కోట్లు పెడుతున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసమే 12 కోట్లు పెడుతున్నారట. సినిమాలో ఒక సాలిడ్ ఎపిసోడ్ ఉండగా అందులో భారీ విజువల్స్ అవసరం ఉందట. అందుకే ఇందులో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే మేకర్స్ ఏకంగా 12 కోట్లు వెచ్చిస్తున్నారు అని తెలుస్తుంది. మరి విశ్వంభర లో ఆ సీన్ ఎలా ఉంటుందో చూడాలి.సినిమాకు ఆ ఒక్క సీన్ ఎంతో కీలకమని అందుకే ఈ స్థాయిలో మేకర్స్ ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విశ్వంభర మూవీ సెకండాఫ్ లో గ్రాఫిక్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని సినిమాలకు గ్రాఫిక్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆ స్థాయిలో ఔట్ పుట్ రావడం లేదు.విశ్వంభర విషయంలో ఆ తప్పు జరగకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి, త్రిష  కాంబినేషన్ లో స్టాలిన్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. విశ్వంభర సినిమా రిజల్ట్ విషయంలో చిరంజీవి పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: