టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తదుపరి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్మూవీ చేయనున్నారు. చేతికి స్వల్ప గాయం కూడా అవడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈ తరుణంలో కర్ణాటకకు వెళ్లారు ఎన్టీఆర్. తన తల్లితో కలిసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. నేడు (సెప్టెంబర్ 1) మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు.జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినా సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ తరుణంలో ఆమెను సొంతఊరు కుందాపురాకు ఎన్టీఆర్ తీసుకెళ్లారు. శనివారం ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న వారు.. నేడు కొల్లూరులోని మూకాంబిక ఆలయానికి వెళ్లారు. ఎన్టీఆర్ వెంట కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.తల్లితో కలిసి నేడు మూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు ఎన్టీఆర్. పంచె కట్టులో సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉడుపిలోని శ్రీకృష్ణ మఠాన్ని శనివారం (ఆగస్టు 31) దర్శించుకున్నారు ఎన్టీఆర్. తాను సొంత ఊరు కుందాపురకు తీసుకెళ్లి ఊడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శింపజేయాలని తన తల్లికి ఉన్న కల నెలవేరిందని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

నేడు మూకాంబిక ఆలయానికి వెళ్లారు.జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.కర్ణాటకలోని ఉడిపి,కొల్లూరు ఆలయాలను సందర్శించుకున్నారు.ఎన్టీఆర్ పంచకట్టులో కనిపించారు.ఈ ఫోటోను దేవర సినిమా టీం పోస్ట్ చేసింది.దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక అని క్యాప్షన్ పెట్టింది. తారక్ ట్రెడిషనల్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలావుండగా ఎన్టీఆర్ తదుపరి దర్శకుడు ప్రశాంత్ నీల్‍తో మూవీ చేయనున్నారు. ఉడుపి మఠానికి ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కలిసి వెళ్లారు. ఎన్టీఆర్ - నీల్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో పాన్ ఇండియా రేంజ్‍లో చాలా హైప్ ఉంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పాపులర్ కాగా.. త్వరలోనే మూడో సాంగ్ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: