బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా నిన్నటి రోజున తెలుగు సినీ పరిశ్రమ బాలయ్యకు గ్రాండ్ గా సత్కరించడానికి వేడుకలను సైతం నిర్వహించింది.. 1974లో వచ్చిన తాతమ్మకల చిత్రంతో మొదటిసారి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్యసినిమా వచ్చి ఇప్పటికీ 50 ఏళ్లు  పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు సైతం చిరంజీవి, శ్రీకాంత్, వెంకటేష్, నాని, ఉపేంద్ర, మోహన్ బాబు, రానా ,రాఘవేంద్రరావు తదితర నటీనటులు డైరెక్టర్లు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది.



అయితే ఈవెంట్లో చిరంజీవి రావడం అటు బాలయ్య అభిమానులను చిరంజీవి అభిమానులను ఆనందపరిచింది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్టేజ్ పైన చూడడం కూడా జరిగింది.  వెంకటేష్ కూడా రావడం మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. బాలయ్య 50 ఏళ్ల వేడుకలలో మేమందరము పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటు చిరంజీవి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక వేడుకల చూస్తోందని ఈ అరుదైన రికార్డు కేవలం బాలయ్యకే సొంతం అని కూడా తెలిపారు. ఎన్టీఆర్ గారూ ప్రజల గుండెలలో ఎలా నిలిచారో ఆయన కుమారుడు బాలయ్య కూడా ఎన్నో పాత్రలు చేస్తూ తన తండ్రికి తగ్గట్టుగా స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.


చిరంజీవి తాను ఇంద్ర సినిమా చేయడానికి ముఖ్య కారణం  బాలయ్య సమరసింహారెడ్డి చిత్రమే ఒక కారణమని కూడా తెలియజేశారు.. తనకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ చిత్రాన్ని చేయాలని కోరికగా ఉన్నదని ఆ కోరికను ఇక్కడ అడుగుతున్నానని.. కలిసి ఒకసారైనా సరే ఇలాంటి ఫ్యాక్షన్ చిత్రాన్ని చేయాలని కోరికగా ఉన్నదని బాలయ్యను డైరెక్ట్ గా అడిగేశారు చిరంజీవి.. ఈ విషయం పైన బాలయ్య కూడా కాస్త నవ్వుతూ ఉన్నారు. మరి బాలయ్య చిరంజీవి కాంబినేషన్లో ఏ డైరెక్టర్ కదని చెబుతారు చూడాలి. ఫ్యాన్స్ సైతం ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు.. కానీ హీరోల అందరూ కూడా ఒకటేనని ఎంతో మంచి అనుబంధంగా ఉంటారని  ఇలాంటి వేడుకలు చూస్తే మనకి అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: