టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత అంతా కాదు. సీనియర్ ఎన్టీఆర్ కారణంగా నందమూరి కుటుంబానికి అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అయితే నందమూరి కుటుంబంలో చాలామంది ఇప్పటికే.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. కొంతమంది ఫెయిల్యూర్ కూడా అయ్యారు. కానీ నందమూరి కుటుంబం అంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలయ్య మాత్రమే అందరికి గుర్తుకొస్తారు.


సీనియర్ ఎన్టీఆర్...వారసత్వాన్ని జనాల్లోకి తీసుకువెళ్లింది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి బాలకృష్ణ మాత్రమే. అయితే అలాంటి నందమూరి బాలయ్య మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. హరికృష్ణ మరణం తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలవలేదు. బాలయ్య ఉన్నచోట ఎన్టీఆర్ ఉండడు... ఎన్టీఆర్ ఉన్నచోట బాలయ్య ఉన్నాడు.

అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా...నందమూరి బాలకృష్ణ ఈవెంట్ జరిగింది. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా... హైదరాబాదులో వేడుక నిర్వహించింది నందమూరి కుటుంబం. అయితే ఈవెంట్ కు హాజరు కావాలని జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందిన కూడా... ఆయన రాలేకపోయారు. దీంతో మళ్లీ విభేదాలు తెరపైకి వచ్చాయి. నందమూరి కుటుంబం అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టం లేదని...  అందుకే ఎన్టీఆర్ రాలేకపోయారని కొంతమంది అంటున్నారు.


అయితే తన తల్లి.. పుట్టినరోజు సెప్టెంబర్ రెండో తేదీ. ఈ తరుణంలోనే మూడు రోజుల ముందుగానే హైదరాబాద్ నుంచి ఉడిపి వెళ్లి పో యారు...  జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. మరో వారం రోజులు అక్కడే ఉండనున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ ఈవెంట్ ఉన్న నేపథ్యం లో... కావాలనే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబాన్ని తీసుకొని ఉడిపి వెళ్లినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి దీని పై నంద మూరి కుటుం బం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: