బిగ్ బాస్ 8 సీజన్ ఆదివారం రోజు సాయంత్రం 7 గంటలకు చాలా అట్టహాసంగా స్టార్ట్ అయింది. అయితే ఎన్నో రోజుల నుండి బిగ్ బాస్ 8 హోస్టుగా వేరే హీరో చేస్తున్నారు అనే రూమర్స్ కి చెక్ పడి ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్టుగా చేస్తున్నారని అందరికీ అర్థం అయిపోయింది.ఇప్పటికే హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ బిగ్ బాస్ 8 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఓ కంటెస్టెంట్ తో హీరోయిన్ రష్మిక మందన్నాకి దగ్గరి సంబంధం ఉందట. మరి ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు.. రష్మికతో ఆ కంటెస్టెంట్ కి ఉన్న అనుబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. బిగ్ బాస్ 8 లోకి ఎంతో మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరే కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో  కృష్ణ అనే హీరోయిన్ రోల్ పోషించిన ప్రేరణ కూడా వచ్చింది. 

అంతేకాదు ఈ సీరియల్లో ముకుందా అనే విలన్ పాత్రలో నటించిన యాష్మీ గౌడ కూడా వచ్చింది. అయితే సీరియల్ ఆర్టిస్టు ప్రేరణతో హీరోయిన్ రష్మికకి దగ్గర సంబంధం ఉందట.. అదేంటంటే..వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అట. అవును మీరు వినేది నిజమే. రష్మిక,ప్రేరణ ఇద్దరు కన్నడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే.అలా రష్మిక ప్రేరణ ఇద్దరు అవకాశాల కోసం ఎన్నో రోజులు స్కూటీ ల మీద సినిమా ఆఫీసులకు వెళ్లేవారట.అంతే కాదు వీరిద్దరూ ఒకే బెడ్ పై కూడా పడుకునే వారట.

అలా వీళ్ళిద్దరూ ఎంతో మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఒకే కంచెం ఒకే మంచం అనేలా ఇద్దరు ప్రవర్తించేవారట.కానీ అదృష్టం కొద్ది రష్మిక పెద్ద హీరోయిన్ అయిపోయింది. ప్రేరణ సీరియల్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది. ఇక వీరిద్దరూ రాత్రి సమయంలో షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లేవారట.అలా హాస్టల్ లో ఉండడంవల్ల వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు.అలాగే సమయం దొరికినప్పుడల్లా రష్మిక ప్రేరణ ఇద్దరు తరచుగా కలుసుకుంటూ ఉంటారట.మరి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రేరణకి రష్మిక మందన్నా తరఫున నుండి ఏదైనా సపోర్టు ఉంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: