ఏంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినితో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గొడవలు పెట్టుకుంటుందా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ లో ఎంత నిజం ఉంది.. నిజంగానే అత్త కోడళ్లకి పడడం లేదా.. అందుకే తన తల్లి కోసం ఎన్టీఆర్ కొత్త ఇల్లు నిర్మిస్తున్నాడా..అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. గత కొద్ది సంవత్సరాల  నుండి జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి కోరిక తీర్చడం కోసం ప్రయత్నిస్తున్నారట.అలా చివరికి తన తల్లి పుట్టిన రోజు సెప్టెంబర్ 2న జరిగింది.అయితే పుట్టినరోజుకి ముందే తల్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి కర్ణాటకలోని ఉడిపి కృష్ణుడి ఆలయానికి తీసుకువచ్చి తన తల్లి కోరిక నెరవేర్చారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఎన్టీఆర్ తన తల్లి కోసం ఒక అద్భుతమైన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసారట.

 అయితే ఈ ఇంటి స్థలం కొనుగోలు చేయడంలో ఎన్టీఆర్ కి తన స్నేహితుడు హీరో డైరెక్టర్ అయినటువంటి రిషబ్ శెట్టి సహాయం చేసినట్టు తెలుస్తుంది. ఇక చాలా రోజు నుండి తన తల్లి సొంతూరు అయినటువంటి కర్ణాటకలోని కుందాపురంలో ఒక ఇంటిని కట్టియ్యాలని అనుకుంటున్నారట. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తల్లి శాలిని కోసం కుందాపురంలో ఒక మంచి ఇంటి స్థలాన్ని ఎన్టీఆర్ కొనుగోలు చేశారట.కుందాపురంలో ఎన్టీఆర్ తన తల్లి కోసం అత్యధునిక సౌకర్యాలు ఉన్నటువంటి ఒక లగ్జరీ హౌస్ ని త్వరలోనే నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తన తల్లి ప్రస్తుతం తనతోనే ఉంటుంది.

కానీ ఆమెకి తన సొంతూరు వెళ్లాలి అనుకున్న ప్రతిసారి కొన్ని రోజులు కుందాపురం వచ్చి అక్కడ టైం స్పెండ్ చేయడం కోసం ఎన్టీఆర్ ఈ ఇంటిని కట్టియాలని నిర్ణయించుకున్నారట. అలా శాలినికి సొంతూరు వెళ్లాల్సిన సమయంలో కుందాపురంలోని ఇంట్లో కొద్ది రోజులు ఉండి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ మ్యాటర్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ఎన్టీఆర్ తల్లికి,భార్యకి మధ్య పడడం లేదని, అందుకే తల్లి కోసం ఎన్టీఆర్ వేరే ఇల్లు నిర్మిస్తున్నారంటూ ఒక రూమర్ వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: