బుల్లితెరలో రియాల్టీ షో గా ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మన తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్ లను విజయవంతంగా పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వందరోజుల పాటు సాగే ఈ రియాల్టీ షో ఆదివారం నాడు ప్రారంభమైంది. ఇక ఈ సీజన్ లో భారీగా ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తుంది. సీజన్ ప్రారంభంలోనే ఎంటర్టైన్మెంట్ లో ట్విస్ట్ లో ఎటువంటి లోటు ఉండదు అంటూ నాగార్జున మాటలు అందరినీ ఒక్కసారిగా ఆకట్టుకుంది.

ఇక బిగ్ బాస్ 8 సీజన్ లో సరికొత్త రూల్స్ విషయానికి వస్తే.. సీజన్ మొత్తం కూడా కెప్టెన్లు ఉండరని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సీజన్ కు మారో రెండు కండిషన్లు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే.. ఈ సీజన్ మొత్తంలో రేషన్ అంటూ ఉండదని ఎవరికీ వారే  సంపాదించుకోవాలని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రైజ్ మనీ కూడా జీరో ఉంటుందని చెప్పి ఆశ్చర్యపరిచిన నాగార్జున ఎవరు ఎంత అడుగుతే అంత ప్రైజ్ మనీ ఉండబోతుంది లిమిట్ లెస్ అన్న ఆసక్తికర ట్విస్టును ఈ సీజన్లో రివిల్ చేశారు.

ఇది ఇలా ఉండగా.. మరోవైపు బిగ్ బాస్ షోలో తనదైన శైలిలో నాగార్జున ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సీజన్ ప్రారంభంలోనే అనిల్ రావు పూడి, రానా, నాని, నివేదిత థామస్ లాంటి తారలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ మేచ్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక అనిల్ రావుపూడి ఇచ్చిన ట్విస్ట్ చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ ట్విస్ట్ ఏమిటి అంటే.. షో ప్రారంభంలోనే ఎలిమినేషన్ అంటూ నాగ్ మణికంఠను హౌస్ నుండి బయటకు తీసుకొని వెళుతున్నట్లు బయటకు వచ్చి ప్రాంక్ అంటూ కంటెస్టులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసాడు.

ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ ఈస్ట్ విషయానికి వస్తే.. యష్మి, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, నబీల్ అఫ్రిదిలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: