మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర పార్ట్ 1” మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమా విడుదలకు కేవలం 25 రోజులు మాత్రమే సమయం వుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది.. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు సాంగ్స్ రిలీజ్ చేసారు .. ‘దూకే దైర్యమా జాగ్రత్త’ అంటూ సాగే మాస్ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. 

అలాగే రీసెంట్ గా ఈ సినిమా నుండి ‘చుట్టమల్లె’ అంటూ రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ రొమాంటిక్ సాంగ్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయింది.. రికార్డ్ వ్యూస్ తో చుట్టమల్లె సాంగ్ దూసుకుపోతుంది.విడుదల చేసిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. దీనితో ఈ సినిమా నుండి వచ్చే మూడో సాంగ్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి…స్టార్ లిరిక్ రైటర్ అయిన రామజోగయ్య శాస్త్రి మూడో సాంగ్ భీబత్సం సృష్టిస్తుంది అని హింట్ ఇవ్వడంతో ఈ సాంగ్ పై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇదిలా ఉంటే ఈ మూడో సాంగ్ పై మేకర్స్ తాజాగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య సాగే ఈ మాస్ డ్యూయెట్ ను మేకర్స్ సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, జాన్వీ లుక్స్ అదిరిపోయాయి. మాస్ డ్యూయెట్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ తెగ తొందరపడుతున్నారు…

మరింత సమాచారం తెలుసుకోండి: