హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 29న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. దీంతో సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగుంటున్నాయి. అయితే, మొదటి రోజు ఇండియాలో రూ. 9 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో ఓపెనింగ్ చేసిన ఈ మూవీ రెండో రోజు వసూళ్లు పడిపోయాయి. ఇక మూడో రోజు ఓపెనింగ్ డే అంత రేంజ్‌లో కలెక్షన్స్ వసూలు చేసింది. మూడో రోజు రూ. 9.15 కోట్ల నికర వసూళ్లు అర్జించిన ఈ సినిమా 4వ రోజు రూ. 9.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.ఇది ఇలా ఉంటే తాజాగా సరిపోదా శనివారం చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది.  ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు, సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న తీరుకు థాంక్స్ చెప్పారు.

ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది. సరిపోదా శనివారం రిలీజ్ తరువాత, డే వన్ కలెక్షన్ల తరువాత ఫ్యాన్స్ అంతా కూడా నాని టైర్ వన్‌ లోకి వెళ్లాడంటూ రచ్చ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్, నాని ఫ్యాన్స్ మధ్య వార్ జరిగిన విషయం తెలిసిందే. ఇదే విషయం గురించి మీడియా నాని దగ్గర ప్రస్తావించగా..కానీ ఈ టైర్‌ ల గోల నాకు తెలియదు. నేను దాని గురించి పట్టించుకోను. అసలు అవేంటో కూడా తెలీదు.  తనకు తెలియని వాటి గురించి, తనకు సంబంధం లేని వాటి గురించి ఎందుకు అడుగుతున్నారు అని నాని చెప్పుకొచ్చాడు. అలాగే తనకంటూ ప్రత్యేకమైన టార్గెట్ అంటూ ఏమీ లేదని ఆ టైర్ వన్ టైర్ టు అనేది కూడా లేదని, టైర్ వన్ లోకి వెళ్లాలన్న అది కూడా తనకు లేదని, నచ్చిన కథ వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోవాలని ఉంది అని చెప్పుకొచ్చారు హీరో నాని.ఇది ఇలా ఉంటే రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన నాని సరిపోదా శనివారం సినిమాకు ఇంకా 9.28 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. అలా అయితేనే సినిమా హిట్ కొట్టినట్లు అవుతుంది. దసరా, హాయ్ నాన్న తర్వాత సరిపోదా శనివారంతో నాని హ్యాట్రిక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ కలెక్షన్స్‌ను మరో 3, 4 రోజుల్లో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: