కేరళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఒక్కో సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు, ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అంటూ వార్తలు రాగా..  ఇప్పుడు టాలీవుడ్ లో కూడా జస్టిస్ హేమ కమిటీ లాంటి నివేదిక వేయాలి అని స్టార్ హీరోయిన్ సమంత ఒక పోస్ట్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  దీనికి తోడు మరొకసారి హీరోయిన్ అనుష్క శెట్టి కూడా టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని , ఇక్కడ కూడా కమిటీ వెయ్యాలి అని కోరడంతో , ఇక నిజంగానే ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉందా అంటూ అప్పుడే అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ అందుకు నివేదిక కూడా వేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని స్టార్ హీరోయిన్ సమంత కోరగా,  ఇప్పుడు ఇదే విషయంపై అనుష్క స్పందిస్తూ.. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ముఖ్యంగా ఆడవారిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.  తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కలిగించాలి. ఇందుకోసం మీరు హేమా కమిటీ లాంటి ఒక నివేదికను ఇక్కడ కూడా వేయాలి అంటూ అనుష్క పోస్ట్ పెట్టింది.

ఇక ఇలా సమంత,  అనుష్క ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఇలాంటి కామెంట్లు చేయడంతో టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి అంటూ సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.  మరి దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి అయితే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆడవారికి రక్షణ లేకుండా పోతుందనే విషయం అయితే ఇక్కడ స్పష్టం అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: