తెలుగు ప్రేక్షకులు గత రెండు దశాబ్దాల్లో ఎందరో వారసుల అరంగేట్రాలు చూశారు. కానీ ఒక కుర్రాడి అరంగేట్రం మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఆ కుర్రాడే.. నందమూరి మోక్షజ్ఞ. నందమూరి బాలకృష్ణ తనయుడైన మోక్షజ్ఞ ఆరేడేళ్ల కిందటే హీరోగా పరిచయం కావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది.ఒక దశలో మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తే లేదని.. అతను తెరంగేట్రం చేయకపోవచ్చని వార్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో తన అవతారం చూస్తే ఆ ప్రచారం నిజమే అనిపించింది. కానీ ఈ మధ్య మోక్షజ్ఞలో చాల  మార్పు వచ్చింది. తన లుక్స్ పూర్తిగా మార్చుకున్నాడు. సినిమా వాళ్లతో కలిసి కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ చూస్తే.. అతడి అరంగేట్రం అతి సమీపంలోనే ఉందని నందమూరి అభిమానులకు అర్థమైపోయింది.మోక్షజ్ఞ అరంగేట్రం కోసం రకరకాల ఆప్షన్లు పరిశీలించిన బాలకృష్ణ.. చివరికి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఫిక్సయ్యాడన్నది లేటెస్ట్ న్యూస్. మధ్యలో అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది కానీ.. అతను వెంకటేష్ మూవీని మొదలుపెట్టడంతో రేసు నుంచి తప్పుకున్నట్లే అయింది.‘జై హనుమాన్’ కంటే ముందు రణ్వీర్ సింగ్‌తో సినిమా చేయాల్సిన ప్రశాంత్.. అది క్యాన్సిల్ కావడంతో కొంచెం ఖాళీ అయ్యాడు. ఈ టైంలోనే బాలయ్యకు, అతడికి మధ్య సంప్రదింపులు జరగడం.. మోక్షజ్ఞ అరంగేట్ర చిత్రానికి దర్శకత్వం వహించడానికి అతను అంగీకరించడం జరిగిపోయాయని.. సొంత బేనర్లోనే ఈ సినిమాను బాలయ్య ప్రొడ్యూస్ చేయబోతున్నాడని.. ఆయన చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించబోతోందని ఇండస్ట్రీ జనాల టాక్. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రావచ్చంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మోక్షజ్ఞ కొత్త లుక్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ సినిమాకు ఓ ఆసక్తికర అప్‌డేట్‌ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమం జరుపుకోనుందట. ఇందుకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం సెప్టెంబర్‌ 6న మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా ఆ రోజున ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్‌ చేసేందుకు టీం ప్లాన్‌ చేస్తోందట. ఇక ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తూ ప్రశాంత్‌ వర్మ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. మోక్షజ్ఞ మూవీ లాంచ్‌పై ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడు. ది లయన్‌ కింగ్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ "ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ఒక కొత్త ఉషస్సు విరజిమ్ముతోంది. సింబా వస్తున్నాడు" అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది చూసి నందమూరి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 'సింహం వారసుడు సింబా' అంటూ హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ పోస్ట్ అభిమానుల్లో ఉన్న సందేహాలకు క్లారిటీ వచ్చింది.నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారమంత ఓ గాసిప్‌ మాత్రమే. ఇందులో నిజమెంత అనేది ఫ్యాన్స్‌లో సందేహం నెలకొంది. ఇక తాజాగా ప్రశాంత్‌ వర్మ పోస్ట్ తో అందరికి క్లారిటీ వచ్చింది. మొత్తానికి ప్రశాంత్‌ వర్మ నందమూరి అభిమానులకు పండగ లాంటి అప్‌డేట్‌ ఇచ్చాడంటున్నారు. కాగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించబోయే  ఈ సినిమాను ప్రశాంత్‌ వర్మ సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కంచబోతున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: