మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. రామ్ చరణ్.. శంకర్ కాంబోలో మూవీ కాబట్టి ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా ఓ టాక్ ఉంది. కాకపోతే రావాల్సిన దానికన్నా బాగా ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది గేమ్ఛేంజర్. అన్నీ కుదిరితే డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ఇక వినయ విధేయ రామ తర్వాత మరోసారి రామ్ చరణ్ తో జోడీ కట్టింది కియారా అద్వానీ. ఫస్ట్ టైమ్ శంకర్ సినిమాకు సంగీతం చేస్తున్నాడు థమన్.గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కోసం సినీ ప్రేక్షకులు చాలా నిరీక్షిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆలస్యమవుతూనే ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ ఉంది. అయితే, ఎప్పుడు విడుదలవుతుందనేది టెన్షన్ ఇంకా ఉంది. అయితే, ఈ ఉత్కంఠకు తెరదించేందుకు మూవీ టీమ్ రెడీ అయిందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్‍ను ప్రకటించేందుకు సిద్ధమైందనే సమాచారం బయటికి వచ్చింది.గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను ఈవారమే వినాయక చవితి రోజున (సెప్టెంబర్ 7) ప్రకటించాలని మూవీ టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ పోస్టర్‌తో విడుదల తేదీని రివీల్ చేయనుందని టాక్.

గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఈ డేట్‍తోనే పోస్టర్ రానుందట.మరో నాలుగు రోజుల్లోనే సెప్టెంబర్ 7న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఈ అప్‍డేట్ కోసం రామ్‍చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు మూడేళ్లుగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది.గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఓ టీజర్ ఈనెలలోనే రానుందని తెలుస్తోంది. ఈనెలాఖరులో టీజర్ రిలీజ్ చేసేలా మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తంగా చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న అప్‍డేట్లు ఈ మూవీ నుంచి వరుసగా వచ్చే అవకాశం ఉంది. ఈనెలలోనే రెండో పాటను తీసుకొచ్చే పనులు జరుగుతున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమా కోసం తన షూటింగ్‍ను రామ్‍చరణ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. అయితే, రీషూట్లు ఉంటాయనే రూమర్లు వచ్చాయి. ఏదిఏమైనా క్రిస్మస్ సందర్భంగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఇటీవలే నిర్మాత దిల్‍రాజు మరోసారి స్పష్టంగా చెప్పారు. దీంతో డిసెంబర్ 20నే యూనిట్ డిసైడ్ చేసిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: