నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి గత కొద్ది సంవత్సరాలు ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఆయన వెండితెరపై కనిపిస్తాడా? అని నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డెబ్యూ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కు పూనకాలు కలిగించే అప్ డేట్ వచ్చింది.వినాయక చవితి రోజున నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆరోజు జరుగుతాయని సమాచారం. ఈ మూవీని సూపర్ హీరోల సినిమాటిక్ యూనివర్స్ లో రూపొందించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలావుండగా తాజాగా ప్రశాంత్ వర్మ వేసిన పోస్ట్ తో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. సింబా ఈజ్ కమింగ్ అంటూ వదిలిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది. మోక్షు ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కంచబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను ప్రశాంత్ వర్మ రెడీ చేశారట. ఈ చిత్రంలో మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు సంబంధించి ఇప్పటికే మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారట. ఈ సినిమాను ‘హనుమాన్’ చిత్రాన్ని తలదన్నే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ. ఈ చిత్రంలో బాలయ్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్జునుడి పాత్రలో ఆయన దర్శనం ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రి, కొడుకులను వెండితెరపై చూస్తే అభిమానులు ఊగిపోవాల్సిందే. ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.   ఇదిలావుండగా ఈ చిత్రాన్ని మోక్షజ్ఞ సోదరి తేజస్విని నిర్మించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: