తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో వరదలు ఒక్కసారిగా పోటెత్తి రావడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అయితే ఇలాంటి సమయంలోనే చాలా మంది సినీ ఇండస్ట్రీలోని స్టార్స్ని సైతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరద సహాయం ప్రకటించాలని ఒత్తిడిని తీసుకువచ్చేలా చేస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే చాలామంది హీరోలు సైతం తమ వంతు సహాయంగా కూడా ప్రకటించడం జరిగింది. సినీ సెలబ్రిటీలలో చాలామంది ఇంకా ప్రకటించాల్సి ఉన్నదట. ఇలాంటి వారిలో హీరో ప్రభాస్ కూడా ఒకరని తెలుస్తోంది.



ఇంకా వరద సహాయం ఎందుకు ప్రకటించలేదంటూ ఒక వర్గం ఫ్యాన్స్ ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ కొన్ని విషయాలు ప్రభాస్ గురించి వైరల్ గా అయ్యేలా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ 5 కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ప్రకటించారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు హీరో ప్రభాస్ భారీ విరాళం అంటూ చాలా మంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వేదికగా కాకుండా అని ఏకంగా వెబ్సైట్లో స్టోరీ లాగా కూడా రాసేస్తూ ఉన్నారు.


ఇలాంటి సమయంలోనే కొంతమంది మీడియా ఛానల్ ప్రతినిధులు హీరో ప్రభాస్ మేనేజర్లను సైతం సంప్రదించగా ఇలాంటి ప్రకటన వస్తే ఆయన స్వయంగా తెలియజేస్తారని ఈ విషయాన్ని మీడియా ముందు కూడా తెలియజేస్తారని అలాగే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా తెలియజేస్తారంటూ హీరో ప్రభాస్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారట. ఇప్పటివరకు వరద సాయం ప్రకటించలేదని సోషల్ మీడియాలో కేవలం కొన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారని మీడియా ప్రతినిధులు వివరించారు ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో వరదల పైన కేవలం కొంతమంది పార్టీ నాయకులు ఒక వర్గం హీరోలనే టార్గెట్ చేస్తూ ప్రకటించేలా చేస్తున్నాడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోందట. మరి ఈ విషయాల పైన అటు నటినటులు ఏమంటారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: