టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోగా నటించడం కంటే కూడా వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం హిందీ సినిమా అయినటువంటి బ్రహ్మాస్త్ర లో నాగార్జున కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ... బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో నాగార్జున తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించిన తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా కుబేర అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి నాగార్జునకు సంబంధించిన కొన్ని పోస్టర్లను మూవీ బృందం విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ బృందం కూడా ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. అది కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఆఖరుగా నాగార్జున "నా సామి రంగ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న నాగార్జున సోలో హీరోగా మాత్రం ఒక్క మూవీ ని ఓకే చేయలేదు. వరుస పెట్టి ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: