తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన సినిమాలలో చాలా శాతం మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే దిల్ రాజు తన బ్యానర్ నుండి వచ్చే సినిమాలను ఎక్కువ శాతం సంక్రాంతి కి విడుదల చేయాలి అని చూస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈయన చాలా సినిమాలను నిర్మిస్తూ ఉండడంతో దాదాపు సంవత్సరానికి ఏదో ఒక సినిమాని సంక్రాంతి కి విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజు తన బ్యానర్లో శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా శతమానం భవతి అనే సినిమాను నిర్మించాడు.

మూవీ ని 2017 వ సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమాకు కొనసాగింపుగా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అనే పేరుతో మరో మూవీ ని రూపొందించనున్నట్లు ఆ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు దిల్ రాజు బ్యానర్ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఈ ప్రకటన వచ్చి చాలా కాలం అయిన తర్వాత కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథ పనులు తుది దశకు చేరుకున్నట్లు ప్రకటించాడు.

కానీ ఆ ప్రకటన వచ్చి చాలా కాలం అవుతున్న అందుకు కొనసాగింపుగా మరే అప్డేట్ రాలేదు. మరి సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. మరి శతమానం భవతి నెక్స్ట్ పేజీ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల ఉంటుందా అసలు ఉంటుందా ... లేదా అనేది కూడా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: