కృతి శెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ స్టార్ గా మంచి పేరును తెచ్చుకొని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా అనంతరం కృతి శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఉప్పెన సినిమా అనంతరం నాచురల్ స్టార్ నానితో జతకట్టి శ్యామ్ సింగరాయ సినిమాలో నటించి హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. అనంతరం నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగారు రాజు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ సినిమాల అనంతరం కొన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కూడా మిగిల్చాయి. దీంతో ఆ కృతి శెట్టి కాస్త స్పీడు తగ్గించిందని చెప్పాలి.

అయితే, ఇటీవల మలయాళం సినిమాలో కృతి శెట్టి నటించింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ బాలీవుడ్ తో  వారి అదృష్టాన్నికి పదును పెట్టారు. ప్రస్తుతం ఈ లిస్టులోకి కృతి శెట్టి కూడా వెళ్లిపోయింది. కృతి శెట్టి పెరిగింది ముంబైలోనే. అతని తండ్రి ముంబైలో ఒక పెద్ద వ్యాపారవేత. అలాగే తల్లి కూడా  ఫ్యాషన్ డిజైనర్. తనకు చిన్నప్పటి నుంచి డాన్స్, డ్రామా పై ఇంట్రెస్ట్ ఉండడంతో కృతి శెట్టి కాలేజీలో అడుగుపెట్టిన సమయంలో కొన్ని వాణిజ ప్రకటనలో కూడా నటించింది.

అంతేకాకుండా, అప్పటిలోనే హీరో రుతిక్ రోషన్ నటించిన "సూపర్ 30" సినిమాలో ఒక చిన్న కీలక పాత్రలో నటించింది. అయితే, ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఒక మలయాళం, మూడు తమిళ సినిమాలు ఉన్నట్లు సమాచారం. అలాగే కృతి శెట్టి వరుణ్ ధావన్ కలిసి నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్నం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ ధావన్ కి జంటగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో కృతి శెట్టి అడుగుపెడుతున్నట్లు వార్తలు రావడంతో పాటు కృతి శెట్టి ఈమధ్య ముంబైలో కూడా కనిపించింది. అతి త్వరలోనే ఈ కొత్త సినిమా ముహూర్తం తేదీనీ ఖరారు చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: