ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు  ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ లను పెళ్లయిన వెంటనే  చెబుతున్నారు. మరి కొంత మంది హీరోయిన్లు కాస్త గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం వెంటవెంటనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఆమె ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, jr.ఎన్టీఆర్, మహేష్ బాబు,సిద్ధార్థ్, రామ్ పోతినేని వంటి హీరోలతో ఆడి పాడిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్.. అత్తారింటికి దారేది,రభస, బావ, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాల్లో నటించిన ప్రణీత సుభాష్ తాజాగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. మొదట ఈ హీరోయిన్ కి ఒక పాప ఉంది. అయితే తాజాగా ఈరోజు పండంటి బాబుకు జన్మనిచ్చినట్టు సమాచారం.

 ఏం పిల్లో ఏం పిల్లడో అనే మూవీతో తెలుగు చిత్ర సీమ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణిత సుభాష్ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించింది.అలా ప్రణీత సుభాష్ స్టార్ స్టేటస్ సంపాదించుకోలేక పోయింది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుండగానే ప్రణీత సుభాష్ బెంగళూరు కి సంబంధించిన టాప్ బిజినెస్ మాన్ అయినటువంటి నితిన్ రాజుని 2021 లో పెళ్లాడింది. ఇక పెళ్లయిన వెంటనే 2022లో ఒక కూతురికి జన్మనిచ్చింది. ఆ తర్వాత సంవత్సరం గ్యాప్ లోనే మళ్లీ 2024 లో పండంటి బాబుకి జన్మనిచ్చింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీలో ఇవే లాస్ట్ ఫోటోలు అని చెబుతూ.. పొట్టలో ఉన్న ఈ బేబీ కిక్స్ ని ఇప్పటినుండి కచ్చితంగా మిస్ అవుతాను అంటూ పోస్ట్ పెట్టింది.అయితే ఈ ఫొటోస్ చేసిన చాలామంది నెటిజన్స్ ప్రణీత సుభాష్ డెలివరీకి సిద్ధమైందని,అందుకే ఈ ఫోటోలు షేర్ చేసిందని,అందుకే ఇవే చివరి ఫోటోలను చెప్పిందని కామెంట్స్ పెట్టారు. ఇక ఈ ఫోటోలు పెట్టిన కొద్ది గంటలకే ప్రణీత సుభాష్ పండంటి బాబుకు జన్మనిచ్చినట్టు ఫిలిం సర్కిల్స్ నుండి ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు ప్రణీత సుభాష్ అఫీషియల్ గా బయట పెట్టలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: