ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయింది. ప్రస్తుతం నాల్గవ రోజు కొనసాగుతున్న సందర్భంగా ప్రతిసారి ప్రోమోలు విడుదల చేస్తూ కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమలు అంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నారు. ఇకపోతే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి బ్యూటిఫుల్ గర్ల్స్ మాత్రమే కాదు హాండ్సం అబ్బాయిలు కూడా వచ్చారు. అలాంటి వారిలో మణికంఠ కూడా ఒకరు. మణికంఠ హౌస్ లోకి అడుగుపెట్టగానే చాలామంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు పెరిగిపోయింది. ముఖ్యంగా అలా పెరగడానికి కారణం ఆయన జుట్టు అంటూ చాలామంది చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా అది విగ్గు అని తెలిసి అమ్మాయిలంతా అప్సెట్ అయిపోయారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..  ఎవరూ లేని ఒంటరి వాడిని, అనాధను,  నా కష్టాలు ఇవి , నా బాధలు ఇవి అంటూ సెంటిమెంట్ ప్లే చేస్తూ తెగ గేమ్ ఆడేస్తున్నాడు. నిజానికి నాగమణికంఠ చెప్పే మాటలు వింటే ఎవరికైనా సరే పాపం అనిపించాల్సిందే. హౌస్ లోకి వచ్చింది ఇలా ఫ్లాష్ బ్యాక్ లు,  సెంటిమెంట్ చెప్పడానికి కాదు కదా.. అయితే ఇంకా నాగమణికంఠకు అర్థమయిందో లేదో.. ఇంకా మా అమ్మ లేదు ,నాన్న లేడు,  అమ్మ చితి పేర్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కు తిన్నాను అంటూ సెంటిమెంట్ ప్లే చేస్తూ అందరిని ఏడిపించేసాడు.

దీంతో నాగ మణికంఠ ఎవరితో కలవడం లేదంటూ హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు. ఇకపోతే బ్రెయిన్ లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి. ఇకనుంచి బయటకు వెళ్లిన తర్వాత అందరూ నాపై నెగటివ్ పర్సన్ అనే ట్యాగ్ వేస్తారు నా దగ్గర రూపాయి కూడా లేదు బ్రెయిన్ పెట్టి ఆడు అంటున్నారు. మొత్తం బయటకు వచ్చేసింది ఐ యాం డన్ ఇంతకంటే  ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను అంటూ ఒక్కసారిగా తలపై ఉన్న విగ్గు తీసి పక్కన పెట్టేసాడు నాగమణికంఠ.  దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నాగమణికంఠను కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్ . ఎందుకు ఏడుస్తున్నావ్.. ఏమైంది అని అడిగితే .. నా భార్య నాకు కావాలి, నా అత్తమామల దగ్గర గౌరవం నాకు కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి,  నా మీద నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ పూర్తిగా చచ్చిపోయింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.

ఇక నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే బలవంతుడివి కాబట్టే కదా.. నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి. అని డైలాగ్ కొట్టి వెళ్లి ఆడుకోపో అంటూ పంపించాడు బిగ్ బాస్ . ప్రస్తుతం ఇది చూసి నాగమణికంఠ విగ్గు పెట్టుకున్నాడా అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: