హనుమాన్ సినిమాతో యావత్ దేశం, ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.దాని తర్వాత ‘జైహనుమాన్’ అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆ సినిమాకి సంబందించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో, దానికి జోడించిన క్యాప్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఆయన ఫొటోలు కూడా గతంలో తెగ వైరలయ్యాయి. బాలయ్య కుడా మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారంటూ చెప్పారు. మోక్షజ్ఞ కూడా తన డెబ్యూ సన్నాహాల్లోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులో నుంచి కూడా కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. ఇవన్ని చూస్తుంటే దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.తాజాగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు ఈయనే దర్శకత్వం వహిస్తారని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్ళ మధ్యాహ్నం 1.33 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రశాంత్ పోస్ట్ చేశారు.సింబా ఈజ్ కమింగ్ అని టాగ్ ఇచ్చారు. దీంతో మోక్షజ్ఞ తో సినిమా గురించే ఈ అప్డేటా అని సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది."నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది. సింబా ఈజ్‌ కమింగ్‌" అంటూ క్యాప్షన్ జోడించారు.ప్రశాంత్‌ వర్మ విషయం డైరెక్టుగా చెప్పనప్పటికీ.. సింబా ఇంకెవరో కాదు.. మోక్షజ్ఞనేనంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. తాజా టాక్ ప్రకారం సెప్టెంబర్ 6న ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ కాబోతుంది. ఈ చిత్రంలో టాప్‌ స్టార్‌ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనుందట ప్రశాంత్‌ వర్మ టీం.చాలా ఏండ్లుగా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు మరి సెప్టెంబర్ 6తోనైనా క్లారిటీ ఇస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే డెబ్యూ సినిమాను ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ లో చేస్తుండటం గొప్ప విషయమేనని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: