టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పటాస్ షో ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయమైన శ్రీముఖి తన కామెడీ టైమింగ్ తో, యాంకరింగ్ తో ఫేమస్ అయ్యింది. నటి కావాలనే ఆసక్తితో హీరోయిన్గా విపరీతంగా ప్రయత్నాలు చేసింది. హీరోయిన్ గా రాణించడం అంత సులభం కాదని తెలుసుకొని బుల్లితెరలో నటించింది. ఇక పటాస్ షో ద్వారా మంచి అవకాశాలను అందుకొని షోలు, ఈవెంట్లలో చాలా చురుగ్గా యాంకరింగ్ చేసేది. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ కీలకపాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా.... శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న సంగతి తెలిసిందే.


ఈ షోలో శ్రీముఖి తన సత్తా చాటుకుని ప్రతి ఒక్కరికి గట్టి పోటీని ఇచ్చింది. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ కి విపరీతమైన పోటీ ఇచ్చి టాప్ 2లో నిలిచింది. ఆ షోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ లో మహిళా విన్నర్ శ్రీముఖి అని అనేక రకాలుగా మాటలు వినిపించాయి. కానీ ఫైనల్ గా రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యారు. ఇక ఆ షోలో శ్రీముఖి పార్టిసిపేట్ చేసినందుకు తనకు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చారట. టైటిల్ విన్నర్ రాహుల్ కన్నా శ్రీముఖినే ఎక్కువగా డబ్బులు సంపాదించిందట. ఆ షో నుంచి శ్రీముఖికి విపరీతంగా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.


యాంకర్ గా రాణిస్తూనే వెండితెరపై కూడా రాణించింది. శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమాలో హీరోయిన్గా నటించింది. హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేక యాంకరింగ్ చేస్తూనే కీలక పాత్రల్లో నటిస్తోంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ని కూడా పెట్టి భారీగానే డబ్బులను సంపాదిస్తుంది. ఎంతో అందంగా, బొద్దుగా, చురుగ్గా ఉండే శ్రీముఖికి విపరీతంగా అభిమానులు ఉన్నారు. శ్రీముఖి ఎప్పటికప్పుడు వరుసగా ఫోటోషూట్లు గా చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.


ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా....శ్రీముఖి ఓ టాలీవుడ్ నటుడితో ఎఫైర్ పెట్టుకుందని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ నటుడితో ఎఫైర్ కారణంగానే శ్రీముఖి ఇప్పటివరకు వివాహం చేసుకోవడం లేదని, ఇతర వేరే ఎవరితో కమిట్ అవ్వడం లేదని టాక్ నడుస్తోంది. ఇక ఇందులో ఇంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: