బాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తున్న వేళ చాలా ఇండస్ట్రీలలో ఇలాంటి తరహా కమిటీ మన ఇండస్ట్రీలో కూడా కావాలి అని వారి రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సమంత, అనుష్కలు ఇలాంటి ఓ కమిటీ ఉండాలని మద్దతు తెలిపారు. అంతేకాకుండా తాజాగా శాండిల్ వుడ్ లో కూడా హేమ కమిటీ రిపోర్ట్ తరహా ఒక కమిటీ వేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు. ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు ఎన్నో విషయాలను బయటపడుతున్న వేళ తాజాగా మలయాళ సీనియర్ నటి సౌమ్య ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది.ఆ డైరెక్టర్ నాకు అవకాశం ఇస్తానని తన ప్రైవేట్ పార్ట్ రాడ్డు పెట్టాడంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.నటి సౌమ్య మాట్లాడుతూ.. నేను కాలేజీ రోజుల్లో చదివే సమయంలో ఓ నాటకంలో చేశాను.ఆ నాటకంలో నన్ను చూసిన డైరెక్టర్ నాకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు.అలా ఓ సినిమాలో నన్ను తీసుకున్నారు.

అయితే అప్పటికే ఆసినిమా షూట్ చేసే సమయంలో నాతో తప్పు పని చేయిస్తున్నారని అర్థమైంది.దాంతో నేను ఆ సినిమాలో నటించనని ఇంటికి వచ్చేసాను. కానీ ఆ డైరెక్టర్ భార్య మాత్రం మా ఇంటికి వచ్చి మీ అమ్మాయి మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టాం.కానీ ఇప్పుడు ఆమె సినిమాలో నటించనంటుందని మా ఇంట్లో వాళ్లకు చెప్పింది. దాంతో ఇంట్లో వాళ్ళ కోసం ఆ సినిమాలో నటించాల్సి వచ్చింది. ఇక ఆ డైరెక్టర్ అందరి ముందు నాతో బాగానే ఉన్నట్టు నటించారు. ఒక కూతురు లాగా నన్ను చూశారు.కానీ లోపల మాత్రం ఆయన ఇంటెన్షన్ వేరే..నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి తినడానికి అన్ని రకాల ఫుడ్స్ ఇచ్చి ఆయన భార్య లేని సమయంలో నాపై అత్యాచారం చేశారు. ఇక 18 ఏళ్ల వయసులోనే నేను అత్యాచారానికి గురయ్యాను. అలా దాదాపు సంవత్సరం పాటు నన్ను మెంటల్ టార్చర్ పెట్టి నాపై అత్యాచారం చేశాడు.

ఇక ఈ అత్యాచారం నుండి నేను బయటపడడానికి 30 ఏళ్ల సమయం పట్టింది.అంతే కాదు ఆ సమయంలో ఆ డైరెక్టర్ తనతో బిడ్డని కనాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఓ సమయంలో అయితే  నా యోని లో రాడ్డు దింపి దాన్ని చూసి శునకానందం పొందాడు.. అంటూ నటి సౌమ్య సంచలన కామెంట్స్ చేసింది.అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. ఆయన ఓ కోలీవుడ్ డైరెక్టర్ అని  చెప్పింది. అంతేకాకుండా పోలీసులు తన కేసుని టేకప్ చేస్తే కచ్చితంగా డైరెక్టర్ పేరు,వివరాలు బయట పెడతానని సౌమ్య చెప్పింది. ఒకవేళ ఈ కేస్ ని టేకప్ చేయకపోతే ఆ పేరు వివరాలు బయట పెట్టనని కూడా తెలియజేసింది. ఇక సీనియర్ నటి సౌమ్య చెప్పిన మాటలు విన్న చాలామంది జనాలు వామ్మో ఎంత దారుణం అని ముక్కున వేలేసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: