క‌మెడియ‌న్‌ నుండి దర్శకుడిగా మారాడు ఎల్దండి వేణు. తోలి ప్రయత్నంలోనే నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వేణు తెరకెక్కించిన ‘బలగం’మూవీ సూపర్ హిట్ సాధించింది.బలగం సక్సెస్ అవడంతో రెండవ సినిమా కూడా తన బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. అందులో భాగంగా నేచురల్ స్టార్ నానికి వేణు ఓ క‌థ‌ను నెరేట్ చేశారు. మార్పులు చేర్పులు చేస్తూ కొన్నాళ్లు పాటు న‌డిచిన ఈ వ్యవహారం ఆ తర్వాత ఆగింది. ఎందుక‌నో వేణుతో ప్రాజెక్ట్ చేయ‌టానికి నాని సుముఖంగా లేడు.దీంతో ఇప్పుడు ‘బలగం’ వేణు మ‌రో హీరోని వెతుక్కునే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగా ఇద్ద‌రు హీరోల‌కు ఆయ‌న క‌థ నెరేట్ చేశారు. వారిలో ఒకరు నితిన్‌, మ‌రొక‌రు విశ్వ‌క్‌సేన్‌. ప్ర‌స్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ఈ, వేణు శ్రీరామ్ తో తమ్ముడు సినిమాలో నటిస్తున్నాడు. సో నితిన్ ఇప్పుడే దొరకడు. ఇక మరొక హీరో విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ నాలుగు సినిమాల షూటింగ్ లో ఫుల్ల్ బిజీగా ఉన్నాడు. వాటిలో మెకానిక్ రాకీ సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నాడు. వేణు చెప్పిన కథకు విశ్వక్ నచ్చినా కూడా సినిమా చేయలేని పరిస్థితి. బ‌ల‌గం వంటి హిట్ త‌ర్వాత వేణు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. బడా నిర్మాత చేతిలో ఉన్నా కూడా వేణుకి ఎందుకనో హీరోదొరకడం లేదు. మరి వేణు ఈ ద్వితీయ యజ్ఞం ఎప్పుడు దాటతాడో ఏ హీరో అవకాశం ఇస్తాడో.ఈ నేపథ్యంలోనే తేజ సజ్జని అప్రోచ్ అయ్యాడట వేణు. దిల్ రాజు కూడా తేజని రెండు, మూడు సార్లు కలిసి ఈ కథ గురించి తేజ సజ్జకి వివరించడం జరిగిందట. కాబట్టి తేజ సజ్జ.. సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.‘ఎల్లమ్మ’ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ నడిచే కథ అని తెలుస్తుంది.ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంటుందట. యాక్షన్ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్ కూడా ఉంటుందట. చివరి 30 నిమిషాల్లో హీరో… కొమురవెల్లి మల్లన్న గెటప్ లో కనిపించి ఫైట్ చేస్తాడని… అది సినిమాకి హైలెట్ గా ఉంటుందని…. ‘కాంతార’ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించే దమ్ము ‘ఎల్లమ్మ’ కథలో ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారట.అందుకే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లోనే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: