హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాజా సాబ్.. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్గా హర్రర్ సీన్లతో తెరకెక్కిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ కి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ టచ్ చేయని జోనర్లు ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం



అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారట. ఇదంతా ఇలా ఉంటే ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ ని తీసుకున్నారు. అలాగే కీలకమైన పాత్రలో రిద్ది కుమార్ కూడా నటించినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే పాన్ ఇండియా లేవల్లో నిర్మిస్తూ ఉన్నారు. టీజర్ కి వచ్చిన స్పందనతో ఈ సినిమా పైన అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నద


అదేమిటంటే రాజా సాబ్ సినిమా మ్యూజిక్ రైట్స్ ని ఐకాన్ మ్యూజిక్ సౌత్ ఆడియో కంపెనీ వారు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 15 కోట్ల రూపాయల వరకు ఇందుకోసం ఆ కంపెనీ చెల్లించినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. T - సిరీస్ కి పోటీగా సౌత్ ఐకాన్ మ్యూజిక్ అనే పేరు బాగానే పాపులర్ అయింది. ఈగల్ ,డెవిల్ ఇతరత్రా సినిమా ఆడియో రైట్స్ ని కూడా ఈ సంస్ధ కొనుగోలు చేసిందట .ఒకవేళ రాజా సాబ్  సినిమా ఆడియో హక్కులను కూడా ఈ సంస్ధ కొనుగోలు చేస్తే మాత్రం అది ఈ చిత్రానికి కాస్త ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: