గత కొన్ని నెలలుగా కన్నడ హీరో దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి హత్య కేసు విచారణలో భాగంగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా పవిత్ర గౌడ కూడా ఈ విషయంలో జైలు జీవితాన్ని గడుపుతోంది.రేణుకా స్వామి విచారణలో భాగంగా పోలీసులు కూడా చార్జి సిట్ ఫైల్ చేశారు. అయితే బలమైన సాక్ష్యాలు దొరికాయనే విధంగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దోషుల పైన పలు రకాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేణుకా స్వామి తన చేతులకు గాయాలు అయినప్పటికీ కూడా తనను వేధించొద్దండి అంటూ ప్రాధేయపడిన వదల లేనట్టుగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారుతున్నది.


అంతేకాకుండా ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తున్న వైనం కూడా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆర్ నగర్ పట్నం షెడ్లు దగ్గర రేణుక స్వామి హత్య చేసిన సందర్భంలో ఒక ఫోటో అన్నట్లుగా ఇది మీడియా తెలియజేస్తోంది. అయితే రేణుక స్వామి హత్య ప్లాన్ ప్రకారమే సాగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర, దర్శన్ గ్యాంగ్ ఈ పని చేసిందనే విధంగా సాక్ష్యాలు వెల్లుబడుతున్నాయి.


ఈ గ్యాంగ్ అంతా కలిసి రేణుక స్వామిని టార్చర్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఆధారాలు పోలీసులకు దొరికాయట. అంతేకాకుండా రేణుక స్వామి చెయ్యి కూడా తెగిపడినట్టుగా ఒక ఫోటో వైరల్ గా మారుతున్నది. నిందితుల మొబైల్ నుంచి వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రక్తపు మరకలతో ఉన్న పవిత్ర చెప్పులను కూడా సీజ్ చేసినట్లుగా సమాచారం. అలాగే పప్పులో ఎంజాయ్ చేస్తున్న సమయంలో దర్శన్ కు వచ్చినటువంటి మెసేజ్లు కూడా పోలీసులు ట్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది. రేణుక స్వామి చివరి క్షణాలను ఫోన్లో సహచరులకు షేర్ చేసిన తర్వాత వీటిని డిలీట్ చేశారని ఆ ఫోటోలను రిట్రీవ్ చేసి మరి విచారణ చేదిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: