తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి మూవీ ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమాను చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన రీ రిలీస్ చేశారు. ఈ మూవీ కి కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వచ్చాయి. ఇక టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా రూపొందిన మాస్ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది. 

ఇక సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా రీ రిలీస్ లో భాగంగా చాలా సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ , రవితేజ , ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో ఖడ్గం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2002 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని అక్టోబర్ 2 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఖడ్గం మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: