టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో బుచ్చిబాబు సన ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభించిన కొత్తలో ప్రస్తుత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దగ్గర పని చేశాడు. ఆ తర్వాత ఈయన పంజా వైష్ణ వ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా ఉప్పెన అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడిగా బుచ్చిబాబు కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఈయన ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ బుచ్చిబాబు , ఎన్టీఆర్ కాంబో మూవీ సెట్ కాలేదు.

ఇక ఆ తర్వాత ఈయన రామ్ చరణ్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబో మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు దానితో చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలం నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బుచ్చిబాబు మరింత సమయం దొరకడంతో ఈ మూవీ స్క్రిప్ట్ ను మరింత బలంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సారి కనుక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అంటే జెట్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అలా పక్క ప్లానింగ్ తో బుచ్చిబాబు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: