కొంత మంది నటులు ఫుల్ లెన్త్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆ తర్వాత తమ నటనతో అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. అలా మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత మాత్రం అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న కొంత మంది గురించి తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ : ఈయన బాలనటుడిగా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర , బాల రామాయణము సినిమాలలో నటించాడు. వీటి ద్వారా ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక ఫుల్ లెన్త్ హీరోగా నిన్ను చూడాలని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ "స్టూడెంట్ నెంబర్ 1" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

నాగ చైతన్య : అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య "జోష్" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత ఈయన ఏం మాయ చేసావే మూవీ లో హీరో గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుండి నాగ చైతన్య సినిమాలను ఆచితూచి ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం చైతూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: