మెగా ఫ్యామిలీలో సాయిధరమ్ తేజ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన ఇద్దరు మేనమామల్లాగే ఇండస్ట్రీలో నేమ్ ఫేమ్ సంపాదించుకోవడం కోసం డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తున్నారు. అలా సాయి ధరంతేజ్ సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.అయితే అలాంటి ఈయన పిల్ల నువ్వు లేని జీవితం,సుప్రీమ్, విన్నర్,సుబ్రమణ్యం ఫర్ సేల్, ప్రతిరోజు పండగే, చిత్రలహరి,జవాన్ బ్రో, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించారు.ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న గంజా శంకర్ అనే సినిమా వివాదంలో ఉండడం కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. అయితే తాజాగా సాయి ధరంతేజ్ గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. సాయి ధరమ్ తేజ్ యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడు అని నెట్టింట్లో టాక్ అయితే ఇది రూమర్ కాదు నిజమే.

 మరి ఇంతకీ అసలు విషయం ఏంటి అనుకుంటున్నారా..అసలు విషయం ఏంటంటే..సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో కొత్త సినిమా చేస్తున్నారట. తాజాగా ఐశ్వర్య లక్ష్మి బర్త్ డే సందర్భంగా సాయిధరమ్ తేజ్ తో ఐశ్వర్య లక్ష్మి జంటగా చేస్తున్న సినిమా నుండి ఐశ్వర్య లక్ష్మి కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.. మెగా హీరో సాయి దుర్గ తేజ్ 18వ సినిమాగా వస్తున్న ఈ మూవీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి నిర్మాతగా నిరంజన్ రెడ్డి చేస్తున్నారు. అలాగే ఈ సినిమాతో నవ దర్శకుడు రోహిత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అలా సాయి దుర్గ తేజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి వసంత అనే హీరోయిన్ రోల్ పోషిస్తుంది. ప్రస్తుతం ఆమె బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుండి ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టల్ నెట్టింట వైరల్ అవ్వడంతో సాయి దుర్గ తేజ్ యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ కి రెడీ అవుతున్నారు అంటూ నెట్టింట్లో నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: