టాలీవుడ్ నటుడు, నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం విజయ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని బాగా అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. అయితే ఈ విజయ వేడుకలో హీరో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వివేక్ ఆత్రేయ తో తన చిత్రం పై మరియు జోనర్ గురించి వెల్లడించారు. వివేక్ తో అంటే సుందరానికి చిత్రంతో డ్రామా అయిపోయింది, సరిపోదా శనివారం చిత్రంతో యాక్షన్ అయిపోయింది. ఈసారి కామెడీ ఎంటర్టైనర్ చేద్దాం అని నాని అన్నాడు. నాని మరో అవకాశం

 ఇవ్వడం పట్ల దర్శకుడు వివేక్ ఆత్రేయ సంతోషంతో నాని ను హగ్ చేసుకున్నాడు. నాని మరోసారి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాని ఇప్పుడు హిట్ 3లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ గ్లింమ్స్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే నాని ల్లో మెగాస్టార్ కు ఓ మూవీ అంటే విపరీతమైన ఇష్టమట. ఈ విషయాన్ని హీరో నాని స్వయంగా చెప్పారు. చిరంజీవి కొత్తవాళ్లను, మంచి ను అభినందిస్తూ వారికి సోషల్ మీడియా ద్వారా లేదా నేరుగా విషెస్ చెప్పి ప్రోత్సహించడం చేస్తుంటారు. అలానే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ పై కూడా మెగాస్టార్ ప్రశంసలు కురిపించారట్.

ఆ తనను విపరీతంగా ఆకట్టుకుందని మెగాస్టార్ అన్నారట. ఈ విషయాన్ని నాని రీసెంట్ గా సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో తెలిపారు. సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ఉన్న నాని మాట్లాడుతూ.. తన ఏది రిలీజ్ అయిన చిరంజీవి తనకు మెసేజ్ చేస్తారు అని చెప్పాడు. దసరా, హాయ్ నాని సమయంలోనూ చిరంజీవి తనకు మెసేజ్ చేసి బాగుంది అని మెచ్చుకున్నారు అని నాని అన్నాడు. అలాగే శ్యామ్ సింగరాయ్ చిరంజీవికి బాగా నచ్చిందని చెప్పాడు. శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని చిరు తన సతీమణి సురేఖతో కలసి హోమ్ థియేటర్ లో చూశారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: