త్రిష కృష్ణన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరికీ గట్టి పోటీని ఇస్తూ తన హవాను కొనసాగిస్తోంది. 41 సంవత్సరాల వయసులోనూ త్రిష నటన, అందంతో ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. త్రిష చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. త్రిషతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ అక్క, చెల్లి, తల్లి పాత్రలలో నటిస్తుంటే.... త్రిష మాత్రం ఇప్పటికి హీరోయిన్ గానే రాణిస్తోంది.


వయసు పెరిగే కొద్దీ ఈ బ్యూటీ అందం ఏమాత్రం చెక్కుచెదరడం లేదు. ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటించనుంది. 2006లో వచ్చిన స్టాలిన్ సినిమాలో చిరంజీవితో నటించిన త్రిష చాలా కాలం తర్వాత మళ్లీ చిరంజీవి సరసన నటిస్తోంది. ఇదిలా ఉండగా.... తాజాగా త్రిష గురించి నిర్మాత గిరిధర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. త్రిషతో కలిసి ఓ సినిమా తీయాలని అనుకున్నానని చెప్పాడు.


కానీ ఆ సినిమా చేయమంటే త్రిష చేయనని చెప్పింది. ఇక అదే సమయంలో డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఓ స్టోరీని తీసుకుని త్రిష వద్దకు వెళ్లగా ....త్రిష ఆ స్టోరీ విని వెంటనే ఓకే చెప్పింది. కానీ ఆ సినిమా వల్ల నేను చాలా నష్టపోయానని వివరించాడు గిరిధర్‌. నాయకి సినిమా వల్ల నాకు చాలా నష్టం వచ్చిందన్నాడు. ఆ సినిమా అనంతరం త్రిషతో నాకు ఉన్న స్నేహబంధం చెడిపోయిందని స్పష్టం చేశాడు. అదంతా కేవలం డైరెక్టర్ వల్లే జరిగిందని కూడా గిరిధర్‌ చెప్పడం జరిగింది. ఈ సినిమా 10 కోట్లకు చేరిందని డైరెక్టర్ చెప్పడం, కానీ అక్కడ అంతా మ్యాటర్ లేదన్నారు.


దీంతో రెమ్యూనరేషన్ ప్రకారం చాలా తేడాలు వచ్చాయి. నేను త్రిషకు తమిళ సాటిలైట్ రైట్స్ ఇవ్వాలని అనుకున్న, కానీ త్రిష మాత్రం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని గిరిధర్‌ తెలిపారు. అందువల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అని నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. త్రిష వల్లే నా జీవితం నాశనం అయ్యిందంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: