హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి ఆయన పేరు ఎన్నిసార్లు మీడియాలో వినిపించిందో తెలియదు కానీ అంతకు ఎక్కువగానే గత రెండు -మూడు నెలల్లో వినిపించింది.. ఆయన తనతో సహజీవనం చేసి రెండు మూడుసార్లు కడుపు కూడా తీయించి ఇప్పుడు మోసం చేసి మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని లావణ్య అనే యువతి ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆ మీడియా ముందుకు రావడం కూడా తిరగబడరా సామి అనే సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ప్రమోషన్స్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో వచ్చింది. ఆ రావడం మొదలు లావణ్య రాజ్ తరుణ్

 మీద చేసిన ఆరోపణలు, రాజ్ తరుణ్ లావణ్య మీద చేసిన ఆరోపణలు మధ్యలో మాల్వి మల్హోత్రా కేసు పెట్టడం ఇలా అనేక మలుపులు తిరిగి అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆ తర్వాత పురుషోత్తముడు అనే సినిమా అవుట్ ఆఫ్ సిలబస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. మళ్లీ తిరగబడరా సామి ప్రెస్ మీట్ జరుగుతున్న వేదిక వద్దకు లావణ్య వచ్చి రచ్చ రచ్చ చేసింది.. అయితే తాజాగా  ఈ కేసుకు సంబంధించి కొత్త మలుపు తీసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ – లావణ్య కలిసి పదేళ్లు ఒకే ఇంట్లో

 ఉన్నారని.. లావణ్య చెబుతున్న ఆరోపణల్లో నిజం ఉన్నట్లు దానికి సంబంధించి ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించామని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలిపారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని నార్సింగి పోలీసులు నిర్ధారించారు. ఇక లావణ్య ఇచ్చిన ఆధారాలతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్ తరుణ్. తనకు చాలా హ్యాపీగా ఉంది. మాకు పెళ్లి జరిగింది. తాళి కట్టాడు. రాజ్ తరుణ్ తన భర్త అని.. పదేళ్ల నుంచి ఒకే దగ్గర ఉంటున్నామని.. పెళ్లి గురించి కూడా కోర్టులో ప్రూవ్ చేసుకుంటామని మీడియాతో చెప్పింది లావణ్య. కొన్నాళ్ల కిందటే పెళ్లి చేసుకొని కాపురం చేశామని వెల్లడించింది. పోలీస్ చార్జీ షీట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: