మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలోని నంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాదాపు చిరంజీవి 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా కొనసాగుతున్నారు.


ఇక చిరంజీవి ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా ఉన్నారు. ఇదిలా ఉండగా.... అప్పట్లో చిరంజీవి కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు విజయశాంతి. దాసరి నారాయణరావు చేసిన ఒసేయ్ రాములమ్మ సినిమాతో విజయశాంతికి మంచి గుర్తింపు రావడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన హీరోయిన్ మరొకరు లేరు అనేంతలా గుర్తింపు తెచ్చుకుంది.


దీంతో విజయశాంతి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడమే కాకుండా తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఇక ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ముగ్గురు సార్లలో విజయశాంతి మూడవ స్థానంలో నిలిచింది. అమితాబచ్చన్, రజనీకాంత్ తర్వాత మూడవ స్థానంలో విజయశాంతి ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రముఖ మ్యాగజైన్ సంస్థ తెలపడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మరి చిరంజీవి లాంటి స్టార్ హీరోను మించి ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుందంటే విజయశాంతి క్రేజ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, రీ- ఎంట్రీలో మహేష్‌ బాబు హీరోగా చేసిన సరిలేరు నీకెవరు సినిమాలో విజయ శాంతి నటించడం జరిగింది. మహేష్‌ బాబు హీరోగా చేసిన సరిలేరు నీకెవరు సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు విజయ శాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: