ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్లతో కెరీర్లో ఫుల్ జోష్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన NBK 109 చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత ఆయన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రంలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండబోతుందని అంటున్నారు. అలానే ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉండనుందని, ఇందుకోసం ఓ హీరోను పవర్ఫుల్ విలన్‌గా తీసుకొచ్చేందుకు బోయపాటి ప్రయత్నిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు మొదలయ్యాయి.అయితే తాజాగా ఈ చిత్రంలో బాలయ్యతో ఢీ కొట్టేందుకు ఓ టాలీవుడ్ హీరో రెడీ అవుతున్నారని కొత్త ప్రచారం మొదలైంది. ఆ హీరో మరెవరో కాదు మ్యాచో స్టార్ గోపీ చంద్ అని బయట టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన సినిమాలు ఈ మధ్య ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అయితే గతంలో ఆయన విలన్గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు హీరోగానే కొనసాగారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి విలన్‌గా మారబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. చూడాలి మరి ఇందులో నిజమెంతో. గోపి చంద్ ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీనికి విశ్వం అనే టైటిల్ను ఖరారు చేశారు. టీజీ విశ్వ ప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్గా నటిస్తోంది.మరోవైపు బాలయ్య దర్శకుడు బాబీతో కలిసి NBK 109 సినిమా చేస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ఓ కీలక పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, స్పెషల్ సాంగ్లో తమన్నా ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: