టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కు సరైన హిట్ చాలా కాలమే అయ్యింది. గత ఏడాది విడుదలైన ఖుషి మూవీ యావరేజ్ గా ఆడితే.. మొన్నా మ‌ధ్య వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ట్ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో ఇది 12వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. VD12 వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రారంభమైంది.విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సూపర్ కాప్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. రఫ్ అండ్ రియలిస్టిక్ లుక్ లో విజయ్ మెస్మరైజ్ చేశాడు.ఇదిలా ఉండగా.. వీడీ 12 గురించి ఓ క్రేజీ అప్డేట్ ను నిర్మాత నాగవంశీ వదిలారు. “విజయ్ దేవరకొండ సినిమాతో నేను ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. పైగా ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం. ఇందుకు సంబంధించి స్టోరీ సిద్ధంగా ఉంది.  డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న నమ్మకం మాకుంది. తొలి పార్ట్ ఫలితం ఆధారంగా సీక్వెల్ ను తెరకెక్కిస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు. తమ అభిమాన హీరో సినిమా రెండు భాగాలుగా రానుండటంతో.. ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ప్రొడ్యూసర్ ఊహించని విధంగా గూస్ బంప్స్ ఎక్కించే అప్డేట్ ఇవ్వడంతో.. సినిమాపై అంచనాలు కూడా  పెరిగిపోయాయి.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం విడి12 ప్రాజెక్ట్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఆల‌స్మో 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వ‌చ్చింది.ఈనెల మధ్య నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు నెలన్నర రోజులకు పైగా ఫైట్స్ తో పాటు సాంగ్స్ షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దసరా పండుగకు టైటిల్ ను అనౌన్స్ చేస్తారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: