టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. హీరోయిన్లుగా రాణించడం మామూలు విషయం కాదు. కొంతమంది ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు రాక సైడ్ అయిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. మరికొంతమంది మాత్రం వారు నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్లుగా రాణిస్తారు. అలాంటి వారిలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. ఈ భామ తాను నటించిన మొదటి సినిమాతోనే తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు భాగ్యశ్రీ గురించి మాట్లాడుకుంటున్నారు.

ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అంద చందాలను చూపిస్తూ ప్రతి ఒక్క కుర్రాడికి చెమటలు పట్టించింది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కొంతమంది వారు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేసారని టాక్. ఈ సినిమా ఫలితం కాస్త నెగిటివ్ గా ఉండడంతో రవితేజ అభిమానులు కాస్త ఫీల్ అయ్యారట.


మొత్తంగా ఈ సినిమా వల్ల ఎవరికీ పెద్దగా లాభం రాకపోయినప్పటికీ భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం మంచి లాభం వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ భామ తన అందచెందాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. అంతేకాకుండా భాగ్యశ్రీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫిదా చేస్తోంది.


ఇదిలా ఉండగా.... ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాపై భాగ్యశ్రీ బోర్సే హాట్ కామెంట్స్ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరో రవితేజ అద్భుతంగా నటించాడు. కానీ రవితేజ రొమాంటిక్ సీన్లు వచ్చిన సమయంలో కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. దాంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదట. రవితేజ ఏజ్ ఎక్కువ కావడం, భాగ్యశ్రీ యంగ్ కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరకపోవడంతో భాగ్యశ్రీ చాలా ఇబ్బంది పడిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా స్టార్‌ ఉమైర్‌ సంధూ వైరల్‌ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: