తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‌కు చేరుకున్నాడు. రాజమౌళితో సినిమా చేశాక ఆయన 'దేవర' సినిమాకి సైన్ చేశాడు. ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించింది. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో మొదటి భాగం ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది. అంటే ఇంకా 20 రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది అందుకే ఈ మూవీ ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టింది మూవీ టీం. ఒకవైపు ప్రమోషన్లు జోరుగా జరుగుతుండగా మరోవైపు "దేవర" మూవీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ అప్‌కమింగ్ మూవీ అమెరికాలో రికార్డు సృష్టించింది.

ఎన్టీఆర్ సినిమా 'దేవర' టిక్కెట్లు అమ్మడం కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఆ కొన్ని రోజుల్లోనే 15,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీన్నిబట్టి భారతదేశంలో ఈ సినిమాకి ఎంత క్రేజ్‌ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్‌కి ప్రీ సేల్ టిక్కెట్ల ద్వారా 5 లక్షల డాలర్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం అమెరికా నుంచి వచ్చింది. ప్రీ టికెట్ బుకింగ్ ద్వారా ఈ రేంజ్ లో మనీ రావడం అనేది ఇదే ఫస్ట్ టైమ్‌. దీనివల్ల దేవర ఒక అరుదైన రికార్డు సృష్టించినట్లు అయింది. ఇంకా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.

ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే, ఈ సినిమా ప్రీమియర్స్‌ని అర్ధరాత్రి అంటే రాత్రి 12 గంటల తర్వాత మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రపంచం మొత్తం మీద ఈ సినిమాని ఉదయం 1 గంటకు ఒకేసారి ప్రదర్శించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ళలో అదనపు ప్రదర్శనలకు అనుమతి తీసుకుంటున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అనే బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: